విదేశాల్లో తెలంగాణ పౌరులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్రెడ్డి

విదేశాల్లో తెలంగాణ పౌరులకు అండగా ఉంటాం: సీఎం రేవంత్రెడ్డి

అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో నలుగురు దొంగలు దాడి చేసిన విషయం చాలా కలవర పర్చింది. మరోవైపు ఓహియోలో శ్రేయాస్ రెడ్డిపై జరిగిన ఘోరమైన దాడిలో అతను మృతిచెందారు.. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న వరుస దాడులపై మా ఆందోళనలను తెలియ జేయాలని విదేశాంగ మంత్రి జైశంకర్ ను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. 

అమెరికాతోపాటు ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ పౌరులు, విద్యార్థులకోసం వారి అవసరాల తీర్చేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి X లో తెలిపారు.