
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్మారకం వద్ద నివాళి
- స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేని వీరభద్రంకు సీఎం పరామర్శ
హైదరాబాద్, వెలుగు : రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తన ఇంట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్కు చేరుకొని సైనిక అమరవీరుల స్మారకం వద్ద నివాళి అర్పించారు. అంతకుముందు సైనిక్ స్మారక్ వద్ద త్రివిధ దళాలు సీఎం రేవంత్కు స్వాగతం పలి కారు. తర్వాత నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో రాష్ట్ర ప్రభు త్వ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కు వెళ్లి రేవంత్ పరామర్శించారు.
అలాగే, శ్వాస సంబంధిత సమస్యతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను కూడా సీఎం పరామర్శించారు. హెల్త్ కండీషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని, ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. పలు సమస్యల పరిష్కారం కోసం తమ్మినేని.. రేవంత్ను విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. తమ్మినేనిని పరామర్శించిన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఆర్వో అయోధ్య రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, జాలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, తమ్మినేని కుమారుడు సంఘమిత్ర తదితరులు ఉన్నారు.