తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన సీఎం రేవంత్

తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన సీఎం రేవంత్

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను  సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం.  తమ్మినేని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు.  

తమ్మినేని తన స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లిలో ఉండగా  ఛాతిలో నొప్పి వచ్చింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను కుటుంబసభ్యులు ఖమ్మం సిటీలోని ఓ ప్రైవేట్​దవాఖానకు తీసుకెళ్లారు. 

అక్కడ మెడికల్ టెస్టులు నిర్వహించి.. డాక్టర్ల సూచన మేరకు వెంటిలేటర్ సాయంతోనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతుతన్నారుజ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.