సీఎం అయిన తర్వాత సోనియాతో తొలిసారి భేటీ అయిన రేవంత్ రెడ్డి..

సీఎం అయిన తర్వాత సోనియాతో తొలిసారి భేటీ అయిన రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సీఎం  రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సోనియా నివాసానికి రేవంత్ వెళ్లారు. ఉదయం రాహుల్ యాత్రలో పాల్గొన్న నేతలు సాయంత్రం నేరుగా సోనియా నివాసానికి వెళ్లారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా ను కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ విషయం పై తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు తీరును సోనియా గాంధీకి వివరించారు. ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎలా ముందుకెళ్తున్నామన్నదానిపై  సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,  సోనియాకు వివరించారు.