మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్

మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్

మార్చి  7న కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్క్రీనింగ్కమిటీకి లిస్టు పంపామని చెప్పారు. చిట్ చాట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రాలేదన్నారు. 

BRS,BJP అవగాహనతో అభ్యర్థులను ప్రకటించారని చెప్పారు సీఎం రేవంత్. మెదక్, చేవెళ్ల అభ్యర్థులను కేసీఆర్ ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. తమ సర్కార్ పనితీరును చూసి ప్రజలు పార్లమెంట్ఎన్నికల్లోఓటేయాలని పిలుపునిచ్చారు రేవంత్. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసీటు కూడా రాదన్నారు. నరేంద్రమోదీ దేశానికి పెద్దన్న అన్న రేవంత్.. తాను అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొనన్నానని చెప్పారు. తెలంగాణప్రజలకు కావాల్సిన అంశాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. 

ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు  బీఆర్ఎస్ 5, బీజేపీ 8 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. మహబూబ్ నగర్ ఎంపీగా వంశీ చందర్ రెడ్డి బరిలో ఉంటారని సీఎం రేవంత్ ఓ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే..