రాష్ట్రంలో కేసీఆర్ది వన్ మ్యాన్ షో నడుస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా డమ్మీ లేనని, వారంతా కేసీఆర్ కి భజన చేసి వెళ్లిపోతున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన.. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నా.. ,ప్రజలు ఇబ్బంది పడినా.. హై కమాండ్ నిర్ణయం మేరకు సహకరిస్తూనే వచ్చామన్నారు. రాజకీయంగా ఎక్కడ ప్రభుత్వం పై విమర్శలు చేయలేదన్నారు.
చంద్రబాబు దయతో లీడర్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ , తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి. పీసీసీ చీఫ్ ఉత్తమ్పై తలసాని చేసిన విమర్శలపై స్పందించిన ఆయన.. 16 సంవత్సరాలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి… నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారని.. చైనా, పాకిస్థాన్ బార్డర్లో దేశం కోసం పనిచేశారని.. బార్డర్లో పని చేసే సైనికులందరు జీతాల కోసమే పని చేస్తున్నారా? అనేది తలసాని స్పష్టం చేయాలన్నారు . దేశ సైనికులను తలసాని అవమానపరిచారని ఆరోపించిన జగ్గారెడ్డి.. తలసాని తెలివి ఉండి మాట్లాడారో ,తెలివి లేక మాట్లాడారో అర్ధం కావడంలేదని.. తలసాని బార్డర్కి వెకేషన్ కోసం వెళ్లిఉండొచ్చు.. కానీ, ఉత్తమ్, సైనికులు దేశం కోసం వెళ్లి కష్టపడతారని గుర్తు చేశారు.
మంత్రి తలసాని వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ సమర్దిస్తున్నారో? లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.. తలసాని తక్షణమే బేషరతుగా ఉత్తమ్ కి క్షమాపణ చెప్పాలన్నారు. కేసీఆర్ కేబినెట్లో క్యారెక్టర్ లేని మినిస్టర్లే ఎక్కువ ఉన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ ఉన్నట్టే లేదన్న ఆయన. వైన్ షాప్ తెరవడంతో వేల మంది బయటికి వస్తున్నారని.. రేపు రాష్ట్రంలో జరగరానిది ఏమైనా జరిగితే కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఇక, తలసాని.. సంగారెడ్డికి ఏరోజు వచ్చినా అడ్డుకుంటాం అని ప్రకటించారు జగ్గారెడ్డి.. తలసాని మంత్రిలా మాట్లాడడంలేదు.. పైల్వాన్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.. గతంలో కేసీఆర్ని బట్టలు ఊడదీసి కొడతా అని చెప్పిన తలసాని.. ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తున్నారని.. అప్పుడు తిట్టిన నేతలందరినీ కేసీఆర్ చెప్పులకింద పెట్టుకొని తొక్కుతున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ మినిస్టర్లకు పవర్ ఉంది …? అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ నేతలను తిట్టే అర్హత తలసానికి లేదన్నారు.. ఇంకొసారి నోరు జారితే నీ జాతకం అంత విప్పుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.