మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే సీతక్క

మహబూబాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మానవత్వం చాటుకున్నారు. దారినపోయే వారు తన కళ్లెదుట ప్రమాదానికి గురికావడం చూసి ఆమె తన వాహనం ఆపి వారిని దగ్గరుండి ఆస్పత్రికి పంపించారు. ఆస్పత్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించడానికి సిబ్బంది రెడీగా ఉండాలని సూచించిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. 
మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యములో పోడు భూముల హక్కుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. సమావేశం ముగిశాక తిరుగు ప్రయాణం లో మహబూబాబాద్ నుండి బయలుదేరి వెళ్తుండగా  నెల్లికుదురు వద్ద అప్పుడే బైక్ ప్రమాదం జరిగినట్లు గుర్తించి తన వాహనాన్ని ఆపారు. క్షేత గాత్రుల గురించి అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి వారిని దగ్గరుండి హాస్పటల్ కు తరలించారు. దారినపోయే వారని పట్టించుకోకుండా వెళ్లిపోయి ఉంటే క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారేదని, సామాన్యుల పట్ల ఎమ్మెల్యే మానవత్వం చాటుకోవడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.