కేరళ నుంచి తొలిసారిగా ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4న తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. భారతీయ రైల్వే భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్ట్లో భాగంగా SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ద్వారా పర్యాటకుల కోసం నడపున్నారు ఈట్రైన్ ని.. టికెటింగ్, మార్కెటింగ్ వంటి సేవలు జరుగుతున్నప్పుడు SRMPR ద్వారా రైలు, సిబ్బంది ఇతర సౌకర్యాలు అందించబడతాయని ప్రిన్సి ట్రావెల్స్ డైరెక్టర్ దేవికా మీనన్ అన్నారు.
ఈ రైలు ముంబై, గోవా, అయోధ్యకు సర్వీసులను నిర్వహిస్తుంది. మొదటి ప్రయాణం గోవా. ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులు త్రివేండ్రం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, కోజికోడ్, కన్నూర్, కాసర్గోడ్ స్టేషన్లలో ఎక్కవచ్చు. ఒకేసారి 750 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ రైలులో 2 స్లీపర్ క్లాస్ బోగీలు, 11 థర్డ్ క్లాస్ ఏసీ కోచ్లు, 2 సెకండ్ క్లాస్ ఏసీ కోచ్లు ఉన్నాయి. వైద్య నిపుణులతో సహా 60 మంది సిబ్బంది కూడా విధుల్లో ఉంటారు.
ఆహారం, వై-ఫై సౌకర్యం, GPS ట్రాకింగ్ సిస్టమ్ అందించబడుతుంది. స్టార్ హోటల్లో వసతి, ఆహారం, సందర్శనా స్థలాలు టూర్ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి. నాన్-ఏసీ స్లీపర్లో 4 రోజుల గోవా ట్రిప్ కోసం, ఒక ప్రయాణికుడు రూ. 13,999 చెల్లించవలసి ఉంటుంది. 3 టైర్ ఏసీ అయితే రూ.15,150, 2 టైర్ ఏసీ అయితే రూ.16,400 ఛార్జ్ చేయానున్నారు. ముంబై ట్రిప్ కోసం, మొత్తం వరుసగా రూ.15,050, రూ.16,920, రూ.18,825గా నిర్ణయించారు.
8 రోజుల అయోధ్య యాత్రకు ధర - రూ. 30,550, రూ. 33,850, రూ. 37,150గా ఛార్జ్ లు ఉండనున్నాయి. ఈ యాత్ర అయోధ్య, వారణాసి, ప్రయాగ్రాజ్లోని దేవాలయాలు, యాత్రా స్థలాలను కవర్ చేస్తుంది. 10 ఏళ్లలోపు పిల్లలకు టిక్కెట్లు ఉచితం, 10 ఏళ్లు పైబడిన పిల్లలకు, సగం ధర చెల్లించాల్సి ఉంటుంది.