అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా  సీఎం రేవంత్ రెడ్డి మే 5న శంషాబాద్  బస్టాండ్ దగ్గర  కార్నర్ మీటింగ్,  రోడ్ షో నిర్వహిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. 5న సాయంత్రం 4 నుండి  రాత్రి  9  వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.  ప్రయాణికులు, వాహనదారులు సహకరించాలని కోరారు. 

  • హైదరాబాద్ నుండి వయా ఆరంగార్ మీదుగా ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సిన వాళ్ళు శంషాబాద్ ఫ్లై ఓవర్ పై నుండి వెళ్లాలి. శంషాబాద్ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వినియోగించరాదు. 
  • ఎయిర్ పోర్టు నుంచి ఆరంగార్ వైపు వెళ్లవల్సిన వాళ్లు శంషాబాద్ ఫ్లై ఓవర్ పై నుండి వెళ్లాలి.  శంషాబాద్ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వినియోగించరాదు.
  •  మహబూబ్నగర్ నుండి ఆరంగార్ వైపు వెళ్లవల్సిన వాళ్లు  శంషాబాద్ ఫ్లై ఓవర్ పై నుండి వెళ్లాలి.  శంషాబాద్ ఫ్లై ఓవర్ పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు వినియోగించరాదు. 
  • మహబూబ్నగర్ నుండి హైదరాబాద్,  ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించుకోవాలి. 
  • షాబాద్ నుండి హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారు ORR సర్వీస్ రోడ్డును వినియోగించుకోవాలి