నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను ఉమ్మడి గుంటూరు జిల్లాలో పుట్టానని, తనతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే అని అన్నారు.

తన పర్యటన ఉందని తెలుసుకొని హెలిప్యాడ్ ని నాశనం చేసారని, వైసీపీ నాయకులకు బానిసలుగా బతికేవారే ఇష్టమని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, పోరాడితే కేసులు పెట్టారని అన్నారు. గోతులు, దాడులు తప్ప, ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మంత్రి అంబటి రాంబాబు పోలవరం గురించి అడిగితే తనకు తెలీదని అంటాడు, సినిమాల్లో ఉన్న మేము డ్యాన్స్ చేస్తాం, మంత్రిగా ఉండి అంబటి ఎలా డ్యాన్స్ చేస్తారని అన్నారు.