ఎక్సైజ్ ఆఫీసులో కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య

ఎక్సైజ్ ఆఫీసులో కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఘటన

హైదరాబాద్: సాక్షాత్తు జిల్లా ఎక్సైజ్ ఆపీసులో ఆశయ్య అనే కానిస్టేబుల్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో జరిగిందీ ఘటన. చేవెళ్ల ఎక్సైజ్ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఆశయ్య జిల్లా ఎక్సైజ్ ఆఫీసులో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. 
కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితుల కారణంతోపాటు మరో కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని స్వగ్రామం వికారాబాద్ జిల్లా ఎన్నికతల గ్రామం. శనివారం ఉదయం 10 గంటలకు డ్యూటీ కోసం శంషాబాద్ ఎక్సైజ్ కార్యాలయానికి  వచ్చాడు. ఇతని 24 గంటల డ్యూటీ అయిపోవడంతో రిలీవర్ గణేష్ వచ్చి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయడంతో శంషాబాద్ పోలీసులు వచ్చి ఆత్మహత్య సంఘటన స్థలంలో లో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నారు. ఇతను నిత్యం బాగా మద్యం సేవించే వాడని తోటి కానిస్టేబుల్స్ అంటున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.