
తెలంగాణలో మంగళవారం(ఆగస్టు 18) 1763 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 95,700 కు చేరింది. మరో 8 మంది చనిపోవడంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 719కి చేరింది. నిన్న ఒక్కరోజే 1789 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 73,991 కి చేరింది. ఇంకా 20,990 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
ఇక నిన్న ఒక్కరోజే 24542 మందికి కరోనా టెస్టులు చేశారు. దీంతో రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 7,97,470 కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 454, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 169, రంగారెడ్డిలో 166 నమోదయ్యాయి.