దేశ వ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,528 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,37,69,599కు చేరింది. తాజా కేసులతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1,43,654కు చేరుకుంది. ప్రస్తుతం ఇండియాలో పాజిటివ్ రేటు 96.98శాతంగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 25 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5,25,785కు చేరుకుంది. తాజాగా 16,113 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,31,362కు చేరింది. ఇప్పటి వరకు దేశలో 2,00,33,55,257 మంది కొవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27,78,013 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
India records 15,528 new COVID19 cases today; Active caseload at 1,43,654 pic.twitter.com/VgTiwGrYp6
— ANI (@ANI) July 19, 2022