దేశంలో మొదటి సారి భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో మొదటి సారి భారీగా తగ్గిన కరోనా కేసులు

చాలా రోజుల తర్వాత భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొన్ని రోజులుగా ప్రతిరోజు దాదాపు 30 వేల కేసులు నమోదవుతుండగా గడిచిన 24 గంటల్లో 9 లక్షల 93 వేల 665 టెస్టులు చేయగా..22 వేల 65 కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ  కేసులు నమోదవ్వడం గత 9 నెలల్లో ఇదే మొదటి సారి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 99లక్షల6 వేల165 కు చేరాయి. నిన్న354 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 1,43,709 కి చేరాయి. ఇంకా 3,39,820 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న మరో 34,477 మంది కోలుకోవడంతో దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 94లక్షల22 వేల636 కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో డిసెంబర్ 14 వరకు 15 కోట్ల 55 లక్షల 60 వేల 655 టెస్టులు చేశారు.