
కరోనా అనుమానితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కరోనా వైరస్ లక్షణాలున్నాయనే అనుమానంతో నలుగురు కుటుంబ సభ్యులను గుర్తించారు. వెంటనే వారిని సుల్తానాబాద్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు తెలిపారు రామగుండం ఎమ్మార్వో సుధాకర్, గోదావరి ఖని పోలీసులు. కరోనా వైరస్ పై అనుమానం ఉంటే ధైర్యంగా సమాచారం ఇవ్వాలని చెప్పారు.