తెలంగాణలో 45,567 మందికి కరోనా లక్షణాలు

తెలంగాణలో 45,567 మందికి కరోనా లక్షణాలు

హైదరాబాద్ :  క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా ఇంటింటా జ్వ‌ర ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం నుంచి ప్రారంభ‌మైన ఈ స‌ర్వేలో ఇప్పటివరకు 45,567 మందికి కరోనా లక్షణాలున్నట్టు అధికారులు గుర్తించారు. లక్షణాలున్న ప్రతిఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్స్‌ను అందజేశారు. సర్వేలో చిన్నారులు, పెద్దవారి వివరాలు విడివిడిగా సేకరిస్తున్నారు. ఎక్కువ శాతం పెద్దవారిలోనే కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. తీవ్ర కరోనా లక్షణాలుంటే వైద్య సిబ్బంది ఆస్పత్రిలో అడ్మిట్‌ చేస్తోంది.