పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి ‘కరోనా’

పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి ‘కరోనా’

కాంటాక్ట్  లేకుండా  కరోనా వైరస్ సోకదని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ పాతబస్తీలోని ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా వచ్చిందని ఆయన తెలిపారు. ఎయిర్ పోర్టులో పని చేసేవారికి కూడా కరోనా సోకిందన్నారు. వారికి పాజిటీవ్ వచ్చినా అందరూ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. మరోవైపు గచ్చిబౌలి స్టేడియంలో 1500మందికి ఐసోలేషన్ సిద్ధం చేశామని… ఎక్కడా రెడ్ జోన్లు లేవని స్పష్టం చేశారు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా  సోషల్ మీడియా పరిస్థితులు ఉన్నాయని ఇటువంటి పద్దతి మంచిది కాదన్నారు మంత్రి ఈటల.