పాజిటివ్‌లే కాదు కోలుకున్న వారూ పెరుగుతున్నారు.. 76 శాతానికి రికవరీ రేటు

పాజిటివ్‌లే కాదు కోలుకున్న వారూ పెరుగుతున్నారు.. 76 శాతానికి రికవరీ రేటు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతూ భయాందోళనలు కలిగిస్తోంది. అయితే రికవరీ రేట్‌ కూడా హెచ్చుతుండటం శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఇండియాలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 24,67,758కి చేరిందని.. రికవరీ రేటు 76% అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. రికవరీ రేటును బట్టి చూస్తే యాక్టివ్ కేసులు 21.87 శాతం అని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7,07,267గా ఉంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య 32.34 లక్షలుగా ఉంది.