రాజస్థాన్ నుండి హైదరాబాద్‌ వచ్చి దంపతుల ఆత్మహత్య

రాజస్థాన్ నుండి హైదరాబాద్‌ వచ్చి దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా: రాజస్థాన్ నుండి హైదరాబాద్ వచ్చిన దంపతులు మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజు ఖన్నా ఆయన భార్య  జ్యోతి హైదరాబాద్ కు వచ్చారు. ఏం జరిగిందో కానీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వీరి మృతి కారణాలు ఇంకా  తెలియాల్సి ఉంది అంటున్నారు పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  క్లూస్ కోసం ఆరా తీస్తున్నామని.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక దర్యాప్తు ఒక కొలిక్కి వస్తుందని మైలార్ దేవ్ పల్లి పోలీసులు చెబుతున్నారు. కుటుంబంలో ఆర్ధిక ఇబ్బందులా..?  లేదా కుటుంబ కలహాలా.. ? లేక మరే సమస్యతో వీరు మృతి చెందారని నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు.

For More News..

చోరీ చేసేందుకు సీసీ కెమెరా పగులగొట్టి పని కానిస్తుంటే…

టీవీ నటుడు అమర్ అరెస్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

వేడి నూనె పోసి.. కారం చల్లి భర్తపై దాడి

మా అడవిని అమ్మనీయం