ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..అనాథలైన పిల్లలు

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య..అనాథలైన పిల్లలు

ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యకు చేసుకున్నారు మెదక్ జిల్లా  పోతాన్ పల్లి గ్రామానికి చెందిన మంగలి కిషోర్​ (42), కవిత (38) దంపతులు నాలుగు రోజుల కిందట ఇద్దరు విషయం తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కవిత చనిపోగా... ఇవాళ కిషోర్ కుమార్ మృతి చెందారు. కిషోర్ కుమార్ సికింద్రాబాద్ లో బార్బర్ గా పని చేస్తున్నారు. కరోనా వల్ల గిరాకీ లేకుండాపోయింది. నాలుగు రోజుల క్రితం సొంత ఊరిలో ఫంక్షన్ కు భార్యతో కలిసి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు మాసాయిపేట బంగారమ్మ తల్లి ఆలయం దగ్గర భార్యభర్తలు ఇద్దరు విషయం తాగారు. బంధువులు హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయారు. తల్లిదండ్రులిద్దరి మృతితో వారిద్దరు కొడుకులు అనాధలయ్యారు.