బైకుపై వెళ్తున్న భార్యా భర్తలను ఢీకొన్న కారు

బైకుపై వెళ్తున్న భార్యా భర్తలను ఢీకొన్న కారు
  • సిటీ శివారు నార్సింగిలో ఘోర ప్రమాదం

హైదరాబాద్ శివారు నార్సింగిలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న భార్యభర్తలను వేగంగా వచ్చి ఢీకొట్టింది కారు. భార్యభర్తలు ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే నార్సింగి ప్రమాదానికి రాంగ్ రూట్ లో డ్రైవ్ చేయడమే కారణమని చెబుతున్నారు పోలీసులు. బైక్ రాంగ్ రూట్లో వెళ్తూ ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న క్వాలిస్ ను ఢీకొన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భార్య భర్తలు మౌనిక, రాజు మృతి చెందారని తెలిపారు.