మళ్లీ పెరుగుతున్నయ్.. ఒక్కరోజులో 640 కరోనా కేసులు

మళ్లీ పెరుగుతున్నయ్.. ఒక్కరోజులో 640 కరోనా కేసులు

 దేశంలో కరోనా కేసులు రోజురోజుకు క్రమంగా పెరుగుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో  దేశ వ్యాప్తంగా కొత్తగా 640 కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందారు.  ప్రస్తుతం దేశంలో 2997 ఆక్టివ్ కేసులున్నాయి.  ఒక్క కేరళలోనే 265 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా ఒకరు మృతి చెందారు. తెలంగాణలో 5 కేసులు, తమిళనాడులో 15, కర్ణాటకలో 13 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 19 మంది కరోనాతో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

 మొత్తం పది రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఉన్నాయి.  కేరళ,రాజస్థాన్,తమిళనాడు, తెలంగాణ,ఏపీ, బీహార్, చత్తీస్ ఘడ్, గుజరాత్, కర్ణాటక,మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్, పుదుచ్ఛేరిలో పాజిటివ్ కేసులున్నాయి. 

రోజురోజుకి కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది.  దీంతో చాలా చోట్ల మాస్క్ తప్పని సరి చేస్తున్నారు. జనం గుమిగూడి ఉండొద్దని సూచిస్తున్నారు.