యాదాద్రి: ఈ నెల 21 నుంచి 28 వరకు యాదాద్రి ఉద్ఘాటన మహోత్సవాలు జరగనున్నాయి. 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించి రాచకొండ సీపీ మహేష్ భగవత్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఈవో గీతారెడ్డి, డీసీపీ నారాయణ రెడ్డి, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ... యాదాద్రి ఉద్ఘాటనలో ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం: