జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

జూబ్లీహిల్స్ కారు ప్రమాదం కేసులో ట్విస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్ కారు ప్రమాదంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి.  యాక్సిడెంట్ కు కారణం తామేనంటూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు సరెండర్ అయ్యారు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు. దీంతో వారిని పోలీసులు విచారిస్తున్నారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో వెనుక సీటు లో షకీల్ కుమారుడు రహీల్ ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే యాక్సిడెంట్ కు ముందు గచ్చిబౌలిలో ఓ రెస్టారెంట్ ముందు కారు ఆగింది. దీంతో ఆ రెస్టారెంట్ దగ్గర సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కారు డ్రైవింగ్ సీట్ లో ఎవరు ఉన్నారనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. 

కాగా, జూబ్లీహిల్స్‌‌ రోడ్‌‌ నంబర్ 45లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండున్నర నెలల రణవీర్‌‌‌‌ చౌహాన్‌‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అశ్వతోష్‌‌, కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలు గాయపడ్డారు. మహారాష్ట్రకు చెందిన వీళ్లంతా దుర్గం చెరువు కేబుల్‌‌ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ బెలూన్స్ అమ్ముకుంటున్నారు. గాయపడ్డ బాధితులను పోలీసులు నిమ్స్‌‌కి తరలించి చికిత్స అందించారు.

బంధువు కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్‌‌‌‌
ప్రమాదానికి కారణమైన కారుపై బోధన్‌‌ ఎమ్మెల్యే షకీల్‌‌ పేరుతో స్టిక్కర్‌‌ ఉంది. ఇది కాస్తా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే కొడుకు లేదా డ్రైవర్‌‌‌‌ మద్యం మత్తులో కార్‌‌‌‌ డ్రైవ్‌‌ చేసి, యాక్సిడెంట్‌‌ చేసి ఉంటారని తొలుత ప్రచారం జరిగింది. దీంతో దుబాయ్‌‌లో ఉన్న ఎమ్మెల్యే షకీల్‌‌కు జూబ్లీహిల్స్‌‌ పోలీసులు కాల్‌‌ చేశారు. యాక్సిడెంట్‌‌ చేసిన కారు వివరాలు తెలుసుకున్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్‌‌ నంబర్ ఆధారంగా గతేడాది అక్టోబర్‌‌‌‌14న నిజామాబాద్‌‌లో కారు కొన్నట్లు గుర్తించారు. కింగ్‌‌ కోఠికి చెందిన మీర్జా అడ్రస్‌‌, అర్బన్ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఇన్‌‌ఫ్రా కంపెనీ పేరుతో కారు రిజిస్టర్ అయ్యిందని తెలుసుకున్నారు.

కావాలనే అరెస్టు చేయలేదా?
యాక్సిడెంట్‌‌ జరిగిన టైమ్​లో డ్రైవింగ్‌‌ చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని బాధితులు చెప్పగా, డ్రైవర్ పారిపోయాడని పోలీసులు చెప్పారు. వెహికల్‌‌తో పాటు పూర్తి వివరాలు ఉన్నప్పటికీ నిందితుల అరెస్ట్‌‌ విషయంలో జరిగిన ఆలస్యంపై విమర్శలు వస్తున్నాయి. కేబుల్‌‌ బ్రిడ్జి నుంచి యాక్సిడెంట్‌‌ స్పాట్‌‌ వరకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌లో నిందితులను గుర్తించలేకపోయినట్లు తెలిసింది. కారు బ్లాక్ ఫిల్మ్‌‌తో ఉండటంతో డ్రైవ్ చేసిన వ్యక్తి ఎవరు, ఎంతమంది ట్రావెల్ చేశారో తేల్చేందుకు పోలీసులకు సవాళ్లు ఎదురయ్యాయి. డ్రంకన్ డ్రైవ్ కండీషన్‌‌లో యాక్సిడెంట్‌‌ చేశారా అనేది తేల్చలేక పోయినట్లు సమాచారం. అయితే యాక్సిడెంట్​ సమయంలో కారులో మొత్తం ముగ్గురు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.ఇద్దరు అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం.

నిమ్స్‌‌ నుంచి బాధితులు గాయబ్
నిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న రణవీర్‌‌‌‌ చౌహాన్‌‌ తల్లి కాజల్‌‌ శుక్రవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. తర్వాత బాధితులు సారిక, సుష్మ కూడా హాస్పిటల్‌‌ నుంచి వెళ్లిపోయారు. తమకు సమాచారం ఇవ్వకుండానే వాళ్లు వెళ్లిపోయారని హాస్పిటల్‌‌ డ్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌‌ లక్ష్మీభాస్కర్‌‌ చెప్పారు. డిశ్చార్జ్ చేయలేదని తెలిపారు. ఓపీ కార్డుతో ట్రీట్‌‌మెంట్‌‌ ఇచ్చామని, ఓపీ షీట్‌‌ తీసుకుని పోయారని పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే షకీల్‌‌ సూచనలతో బాధితులకు మీర్జా ఫ్యామిలీ రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ డబ్బు తీసుకుని బాధితులు మహారాష్ట్ర వెళ్లిపోయినట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్

‘జూనియర్‌‌‌‌’కు జంటగా శ్రీలీల