
ప్లాస్మా దానం చేయడం వల్ల ఎంతో మందికి ప్రాణం పోసిన వారవుతారని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్. కరోనా బారిన పడి యశోదా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న రవీందర్ అనే వ్యక్తి కి ఇటీవల కరోనాను జయించారని, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్లిన ఇన్స్ పెక్టర్ రఘువీర్ రెడ్డి ముందుకు వచ్చి ప్లాస్మా దానంచేయడం అభినందనీయమన్నారు. ప్లాస్మా దానం చేయాలనుకునేవారు రాచకొండ కంట్రోల్ నెంబర్ 9490617111, కోవిడ్ కంట్రోల్ నెంబర్ 9490617234 లలో సంప్రదించి, తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని కమిషనర్ మహేష్ భగవత్ కోరారు.