ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయటపడాలి

ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి కేసీఆర్ బయటపడాలి

సీఎం కేసీఆర్ తప్పుల వల్లనే తెలంగాణలో బీజేపీ  బలం పెరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ నుంచి ముఖ్యమంత్రి బయటపడాలన్నారు. MIM భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ కేసీఆర్ ను కాల్చుతోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరుగున పడేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడ ఉందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని CPI నేత చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.