పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. సీపీఐ ఆద్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. గడ్డం వంశీకృష్ణ ఎప్పటికీ ప్రజా సేవలోనే ఉంటారని చెప్పారు. సీపీఐ సపోర్టుతో పెద్దపల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ కైవసం చేసుకోనుందన్నారు.
కార్మికుని కొడుకని చెప్పుకుంటున్న కొప్పుల ఈశ్వర్ సింగరేణిలో వేల ఉద్యోగాలు పోతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి పదవి వచ్చాక ప్రజలను మర్చిపోయారని విమర్శించారు. ఎవరు ప్రజాసేవ చేస్తున్నారో.. ఎవరు దోచుకుంటున్నారో పెద్దపల్లి ప్రజలకు తెలుసుకోవాలన్నారు. తన సేవాసంస్థల ద్వారా ఇప్పటి వరకు 5 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఇప్పటి వరకు 10 వేల కోట్ల ట్యాక్సులు కట్టామన్నారు.
కేంద్రంలో మోదీని దించాలంటే కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్వి చాడ వెంకట్ రెడ్డి. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు కోసం సీపీఐ పూర్తి మద్దతిస్తుందని.. భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.