
-
నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనున్న సర్కార్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గడిచిన 2 నెలలుగా వడగండ్ల, అకాల వర్షాలతో జరిగిన పంట నష్టానికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 51.52 కోట్ల నిధులు మంజూరు చేసింది. 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు చెందిన 55,528 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నష్టానికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసి, ప్రభుత్వానికి సమర్పించింది.
సర్కారు ఆదేశాలతో వ్యవసాయ శాఖ రైతువారీగా నష్టం అంచనా వేసి, నిధులను రైతులకు అందజేసేందుకు చర్యలు చేపట్టింది. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవతాయని ఆ శాఖ మంత్రి తుమ్మల చెప్పారు. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం 36,424 ఎకరాల్లో వరి, 3,266 ఎకరాల్లో మక్క, 470 ఎకరాల్లో జొన్న , 6,589 ఎకరాల్లో ఉద్యాన పంటలు , 4,753 ఎకరాల్లో పత్తి,477 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.