కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు..8మంది పరిస్థితి విషమం

కరాచీ బేకరీలో సిలిండర్ పేలుడు..8మంది పరిస్థితి విషమం

హైదరాబాద్: రాజేంద్ర నగర్ లోని కరాచీ బేకరీలో అగ్ని ప్రమాదం జిరగింది. బేకరీ ప్రధాన కిచెన్ లో సిలిండర్ లీక్ కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.  గాయపడ్డ వారిని చికిత్సకోసం 8మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా బీహార్ కు చెందినవారిగా గుర్తించారు. 

రాజేంద్రనగర్ లో ని కరాచీ బేకరిలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ప్రమాదం ఎ లా జరిగిందనే దానిపై ఆరా తీశారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.