తిమ్మాపూర్, వెలుగు : బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఖజానాలో పైసలు లేకుండా చేశారని, అందుకే ప్రజలు కేసీఆర్ను గద్దె దించి కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా స్ట్రీట్కార్నర్ మీటింగ్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు.
అలాగే రూ.500 గ్యాస్ సిలిండర్అందిస్తున్నామని, అందనివారు స్థానిక ఎంపీడీవో ఆఫీసుల్లో నమోదు చేసుకుంటే అర్హతను బట్టి ఇస్తామన్నారు. తమకు రైతులకు రుణమాఫీ చేసే దమ్ము ఉందని, చెప్పిన గడువులోపు చేసి చూపిస్తామన్నారు. ఇండ్లు లేని వారికి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరయ్యాయని, ఎన్నికల తర్వాత ఇల్లు లేని వారికి రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. తర్వాత నుస్తులాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాస్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు కాంగ్రెస్లో చేరారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
ట్రాఫిక్ ను క్లియర్ చేసిన మంత్రి పొన్నం
స్ట్రీట్కార్నర్ మీటింగ్కు భారీగా జనం రావడంతో రాజీవ్రహదారి ట్రాఫిక్తో స్తంభించిపోయింది. దీంతో మంత్రి పొన్నం ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.