త్వరలో సెట్స్‌‌‌‌ పైకి దాసరి బయోపిక్

త్వరలో సెట్స్‌‌‌‌ పైకి దాసరి బయోపిక్

దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, నటుడిగా ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేశారు దాసరి నారాయణరావు. అత్యధిక చిత్రాలు రూపొందించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్‌‌‌‌లో చోటు సంపాదించారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగానూ నిలిచారు. అంతటి గ్రేట్ సినిమా పర్సనాలిటీ బయోపిక్‌‌‌‌ని తీయాలని డిసైడయ్యానంటున్నారు తాడివాక రమేష్​ నాయుడు. ‘దర్శకరత్న’ పేరుతో ఆయన నిర్మించనున్న ఈ చిత్రానికి ధవళ సత్యం దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది. అతి త్వరలో సినిమా సెట్స్‌‌‌‌కి వెళ్లనుంది. ఓ ప్రముఖ హీరో దాసరి పాత్రను పోషించనున్నారట. మరోవైపు దాసరి జ్ఞాపకార్థం ‘దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ అండ్ టీవీ అవార్డ్స్’ ఇచ్చేందుకు కూడా నిర్మాత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం ఆయన దాసరి పేరు మీద ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన నటీనటులు, టెక్నిషీయన్స్‌‌‌‌కి జీవన సాఫల్య పురస్కారాలను ఇవ్వనున్నారు.