వీల్‌చైర్‌‌లోనే దీదీ ప్రచారం

వీల్‌చైర్‌‌లోనే దీదీ ప్రచారం

కోల్‌‌కతా: కాలి గాయంతో బాధపడుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొనాలని నిర్ణయించారు. గాయం పూర్తిగా మానకపోయినా వీల్‌‌‌‌చైర్‌‌లోనే క్యాంపెయినింగ్ చేయాలని ఆమె డిసైడ్ అయ్యారు. గాంధీ మూర్తి నుంచి హజ్రా వరకు వీల్‌ ‌చైర్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. రోడ్ షో తర్వాత హజ్రాలో పబ్లిక్ మీటింగ్‌‌లో ఆమె ప్రసంగిస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. నందిగ్రామ్‌‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న దీదీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తోసేయడంతో ఆమె కాలి మడమకు, భుజానికి గాయాలైన విషయం తెలిసిందే. ఈ గాయంపై తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఎన్నికల కమిషన్‌‌కు ఫిర్యాదు చేశాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని, ఇందులో కుట్ర దాగి ఉందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు.