నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కౌన్సిలర్ ఒకరు, ఇండిపెండెంట్​కలిపి మొత్తం14 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు.

దీంతో అవిశ్వాస తీర్మాణానికి తమ మద్దతు తెలిపారు. దీంతో మున్సిపాలిటీని కాంగ్రెస్​కైవసం చేసుకున్నట్లయింది.  అనంతరం కాంగ్రెస్​ కౌన్సిలర్ నాగపూర్ణ శ్రీనివాస్​మాట్లాడుతూ.. రేఖయాదగిరి, వెంకటేశ్​యాదవ్‌‌‌‌ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాజేంద్రనగర్‌‌‌‌ నియోజకవర్గంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గ్రాఫ్‌‌‌‌ తగ్గుతూ వస్తోందని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌‌‌ బొర్రా జ్ఞానేశ్వర్‌‌‌‌ముదిరాజ్‌‌‌‌అన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్‌‌‌‌కు ప్రజల్లో ఆదరణ కరువవుతుందన్నారు.