రష్యాపై అమెరికా ఆంక్షలు..సముద్రంలో చిక్కుకున్న 48 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ 

రష్యాపై అమెరికా ఆంక్షలు..సముద్రంలో చిక్కుకున్న 48 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ 

రష్యాపై అమెరికా ఆంక్షలు.. రష్యా ఆయిల్​ ఎగుమతులే లక్ష్యంగా అమెరికా విధించిన ఇవాళ్టి (శుక్రవారం ) నుంచి అమలులోకి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపధ్యంలో రష్యాకు ఆదాయ వనరులు దెబ్బతీసే ప్రయత్నంలో అమెరికా రష్యాపై చర్యల్లో ఇదొకటి.గత నెలలో రష్యాన్​ చమురు ఎగుమతి కంపెనీలు రోస్నెప్ట్​ పీజెఎస్సీ, లుకోయిల్​, పీజేఎస్సీలను బ్లాక్​ లిస్టులో పెట్టింది అమెరికా. ఈ నిర్ణయంతో ప్రపంచ ఆయిల్​ మార్కెట్​ ను కుదిపేసింది. దీంతో రష్యా ముడి చమురు గ్రేడ్​ లకు డిమాండ్​ పడిపోయింది.  

ఎనలిస్ట్​ సంస్థ కెప్లర్​ ప్రకారం.. రోస్​ నెఫ్ట్​, లుకోయిల్ కంపెనీలనుంచి దాదాపు 48 మిలియన్​ బారెళ్ల ముడి చమురు రవాణాకు లోడింగ్​ అయి సముద్రంలో సిద్దంగా ఉన్నాయి. ట్రంప్​ ఆంక్షలతో సముద్రంలో నే చిక్కుకుపోయాయి. 

ఈ ఆంక్షలు ఆసియా అంతటా తీవ్ర మార్పులకు దారితీశాయి. ఆంక్షలతో భయపడిన భారతీయ శుద్ధి కర్మాగారాలు మిడిల్​ ఈస్ట్​ నుంచి సరుకులను త్వరగా బుకింగ్ చేయడంతో గల్ఫ్-భారత్ మార్గాలకు సరుకు రవాణా రేట్లను దాదాపు ఐదు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేర్చింది.ప్రస్తుతం సముద్రంలో ఉన్న రష్యన్ కార్గోలకు, ముఖ్యంగా లుకోయిల్ ,రోస్‌నెఫ్ట్‌లకు చమురు కొనుగోలుదారులు ఎవరైనా చివరికి జోక్యం చేసుకుంటారా అని వ్యాపారులు వేచి చూస్తున్నారు.