జూబ్లీహిల్స్ లోని డాక్టర్ ​ఇంట్లో  రూ.20 లక్షల చోరీ

జూబ్లీహిల్స్ లోని డాక్టర్ ​ఇంట్లో  రూ.20 లక్షల చోరీ

జూబ్లీహిల్స్, వెలుగు : డాక్టర్ ఇంట్లో రూ.20లక్షలు చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పీఎస్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్​రోడ్​నంబర్ 52, ప్లాట్​నంబర్1061లో ఉండే అశోక్ కుమార్​డాక్టర్. ప్రస్తుతం అపోలో పనిచేస్తున్నారు. రోజూలాగే 17న ఉదయం ఉదయం డ్యూటీకి వెళ్లిన అశోక్​కుమార్​సాయంత్రం 8 గంటలకు తిరిగి వచ్చారు.

ఇంటి మెయిన్​డోర్​తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలో దాచిన రూ.20 లక్షల నగదు కనిపించలేదు. టెర్రస్​ పైనుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడినట్లు గుర్తించిన అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.