- తెలంగాణ సోనా రైస్ సీడ్స్ సప్లయ్, బైబ్యాక్
హైదరాబాద్, వెలుగు: అన్నదాతకు ఎక్కువ అవసరమైన రెండు సేవలను దక్కన్ ముద్రా అందిస్తోంది. తెలంగాణ సోనా విత్తనాలు రైతులకు ఇవ్వడంతోపాటు వారి పంటను కూడా కొనుగోలు చేస్తోంది ఈ కంపెనీ. గత మూడు సీజన్లుగా ఇబ్రహీంపుర్, దుబ్బాక, జనగాం ప్రాంతాలలోని రైతుల నుంచి తెలంగాణ సోనా ధాన్యాన్ని సేకరించి, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరులలోని 150 అవుట్లెట్ల ద్వారా ఈ తెలంగాణ సోనా రైస్ను దక్కన్ ముద్రా విక్రయిస్తున్నట్లు కంపెనీ ఫౌండర్ శ్రీహర్ష చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ డెవలప్ ఈ లో గ్లైకిమిక్ ఇండెక్స్ వేరియంట్ తెలంగాణ సోనాను డెవలప్ చేసింది. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈ రైస్ను తీసుకోవచ్చు. 120 మందికిపైగా రైతులు తమతో కలిసి పనిచేస్తున్నారని, ఈ సంఖ్యను మరింతగా పెంచాలని టార్గెట్గా పెట్టుకున్నామని శ్రీహర్ష తెలిపారు. బ్లాక్రైస్, సన్ఫ్లవర్సీడ్స్లలోకి అడుగు పెట్టాలనుకుంటున్నామని, వుడ్ప్రెస్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ను మార్కెట్లోకి తేవాలనుకుంటున్నామని పేర్కొన్నారు. మా గురించి కేటీఆర్ ట్వీట్ చేయడం సంతోషం కలిగిస్తోందని, ఈ ఉత్సాహంతో తెలంగాణలోని ఇతర ప్రాంతాల రైతులకూ సేవలు విస్తరిస్తామన్నారు.