ఢిల్లీ: ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో జరిగిన అల్లర్ల గురించి ప్రధానికి వివరించిన కేజ్రీవాల్.. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించమని కోరినట్లు తెలిపారు. మంగళవారం పార్లమెంట్ భవనంలో మోడీని కలిసిన కేజ్రీవాల్… ఢిల్లీ అల్లర్ల తరువాత తీసుకున్న చర్యల గురించి వివరించారు. దీంతో పాటు కరోనా వైరస్ పై తీసుకుంటున్న జాగ్రత్తల గురించి కూడా ప్రధానికి తెలియజేశారు ఢిల్లీ సీఎం. ఢిల్లీ పోలీసులు అల్లర్లను అదుపుచేయడానికి షిఫ్టులుగా పని చేశారని చెప్పారు. దీంతో చాలామంది ప్రాణాలు రక్షించారని తెలిపారు.
Delhi CM Arvind Kejriwal: Delhi Police acted in a swift manner to control the situation when rumours were spread on Sunday night. Had police acted with the same efficiency on Monday & Tuesday last week when riots were confined in a district, so many lives could have been saved. https://t.co/cylMaDduRM
— ANI (@ANI) March 3, 2020