లొంగిపోతానన్న చిదంబరం.. ఒప్పుకోమన్న కోర్టు

లొంగిపోతానన్న చిదంబరం.. ఒప్పుకోమన్న కోర్టు

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంకు ఢిల్లీ కోర్టు మరో షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఈడీ(Enforcement Directorate) కి సరెండర్  అవుతానని పేర్కొంటూ ( లొంగిపోతానంటూ ) చిదంబరం దాఖలు చేసిన పిటిషన్ ను సిబీఐ కోర్టు కొట్టేసింది.  ప్రస్తుతం చిదంబరం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో గడుపుతున్నారు. ఈ నెల 19 వరకు ఆయన రిమాండ్ లో ఉండనున్నారు.