సైకిల్ పై ఆఫీసుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం

సైకిల్ పై ఆఫీసుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ పిసోడియా వెహికిల్ లో కాకుండా.. సైకిల్ పై తన కార్యాలయానికి చేరుకున్నారు. వాహన వినియోగాన్ని తగ్గించాలన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయన ఈ చర్య తీసుకున్నారు. వాయుకాలుష్య నివారణలో భాగంగా కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకువచ్చిన సరి, బేసి విధానం ఈవాళ్టి(సోమవారం) నుంచి ఈ నెల 15వరకూ అమలులో ఉండనుంది.