దేశ రాజధానిలో కొత్త వేరియెంట్ కరోనా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మరో ఇద్దరికీ ఒమిక్రాన్ సోకినట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలుపుకొని దేశ రాజధానిలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 24కు చేరింది. ఒమిక్రాన్ సోకినవారిలో 12 మందిని డిశ్చార్జ్ చేయగా.. మరో 12 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో దాని కట్టడికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణీలకులపై దృష్టి పెడుతున్నారు. కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన ప్యాసింజర్లను హాస్పిటల్ కు తరలించి ఐసోలేషన్ లో ఉంచుతున్నారు.
For more news