పరిగి, వెలుగు: పట్టాదారు పాసుబుక్ఆన్ లైన్చేసేందుకు డబ్బులు తీసుకుంటూ పరిగి డిప్యూటి తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగికి చెందిన వార్ల సూర్యకుమారికి రెండెకరాల పొలం ఉంది. ఎకరాలో రైస్ మిల్లు ఉండగా, మిగతా ఎకరాను నాలా కింద మార్చి ఆన్లైన్ చేయాలంటూ ఆరు నెలల క్రితం దరఖాస్తు చేశారు.
డిప్యూటి తహసీల్దార్ వాజేష్ ఇవాళ రేపు అంటూ కాలయాపన చేసి లంచం అడిగాడు. సూర్యకుమారి కొడుకు సతీష్ నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.