వరంగల్ అర్బన్ : కాజీపేట స్టేషన్ సమీపంలో OHE టవర్ కార్ ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రధానమైన మార్గం కావడంతో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లను ఆయా స్టేషన్లలో నిలిపివేశారు.
కాజీపేటలో కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ను నిలిపివయగా.. పెండ్యాల రైల్వే స్టేషన్లలో సిర్పూర్ ఖాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ను ఆపేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో దానాపూర్ ఎక్స్ ప్రెస్ ను నిలిపారు. వీటితో పాటు లోకల్ ట్రైన్స్, గూడ్స్ నిలిచిపోయాయి. రాళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలు తప్పిన ఇంజిన్ ను తీయడానికి రైల్వ సిబ్బంది చర్యలు చేపట్టారని తెలిపారు రైల్వే అధికారులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.