సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : వివేక్ వెంకటస్వామి

 సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : వివేక్ వెంకటస్వామి

సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే వివేక్ వెంకట్ స్వామి ఆదేశించారు. మార్నింగ్ వాక్ లో భాగంగా  క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా  డ్రైనేజీలను పరిశీలించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. క్యాతన్ పల్లి  ఆర్ఓబీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు రెండు మూడు రోజుల్లో పరిహారం క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.

మిషన్లు, మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి ROB ఫ్లై ఓవర్ పనులు స్వీడ్ చేయాలని కాంట్రాక్టర్ లను వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. సకాలంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని లేకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని అధికారులను కాంట్రాక్టర్ల ను హెచ్చరించారు.