మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేను ముంబైలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు గంటన్నర సేపు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణకు ముందు రాజ్ ఠాక్రే, ఫడ్నవిస్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణలో రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రేకు మంత్రి పదవి దక్కే అవకాశముందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజ్ఠాక్రేకు గత నెలలో లీలావతి హాస్పిటల్లో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత ఫడ్నవీస్, ఠాక్రేను కలవడం ఇదే తొలిసారి. దేవండ్ర ఫడ్నవిస్ ను ప్రశంసిస్తూ రాజ్ ఠాక్రే ఇటీవలే ఓ బహిరంగ లేఖ రాశారు. సీఎం పదవి చేపట్టే అవకాశమున్నా.. పార్టీ విధేయతకు ఉదాహరణగా నిలిచి ఫడ్నవిస్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారని రాజ్ ఠాక్రే అందులో ప్రశంసించారు.
Mumbai | Maharashtra Deputy CM and BJP leader Devendra Fadnavis meets MNS chief Raj Thackeray at his residence pic.twitter.com/mAbGvaLU3j
— ANI (@ANI) July 15, 2022