రైతుల సమస్యలపై 12న కలెక్టరేట్ల వద్ద ధర్నా

రైతుల సమస్యలపై 12న కలెక్టరేట్ల వద్ద ధర్నా

కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి

హైదరాబాద్: రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయాలను ఆయన మీడియా కు విడుదల చేశారు. భారీ వర్షాలు.. వరదలతో తెలంగాణలో రైతులు బాగా నష్టపోయారని..పత్తి, వరి . మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం అనే మాట కూడా చెప్పడం లేదని.. రైతు నష్టపోతే చిల్లిగవ్వ పరిహారం కూడా ఇస్తామనకపోవడం దారుణం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఖండించారు. అందుకే రైతుల పక్షాన పోరాడాలని.. ప్రతి రైతుకు ఎకరాకు 20 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని  కాంగ్రెస్ కోర్ కమిటీ డిమాండ్ చేస్తోందన్నారు. ఈనెల 12న రైతులతో రాస్తారోకోలు చేయడంతోపాటు  కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని జగ్గారెడ్డి వివరించారు.