మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో పాటు..కేవీపీ, వీహెచ్, శ్రీధర్ బాబు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని పీవీ ఘాట్ లో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని దిగ్విజయ్ సింగ్ కొనియాడారు.
తాను కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు పీవీ జాతీయ ప్రెసిడెంట్ గా ఉన్నారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ ప్రధానమంత్రి అయ్యారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను పీవీ సుస్తిరపరిచారని తెలిపారు. పీవీ తెచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో సహాయం చేశాయన్నారు.