
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కేవలం ఇద్దరు ఎంపీలతో సాధించారా అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఎన్నో బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. బీజేపీని గెలిపించేందుకే అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ తెచ్చిన రిజర్వేషన్లతో ముస్లీంలు ఎంతో లాభపడ్డారని గుర్తు చేశారు.