తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అపశృతి.. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ కన్నుమూత

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అపశృతి.. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ కన్నుమూత

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంగళవారం అపశృతి చోటు చేసుకుంది. గుండెపోటుతో కుప్పకూలిన అన్నా డీఎంకే రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ జానీ(72) ఆస్పత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్న ఆయన ఎండ వేడిని ఖాతరు చేయకుండా తిరుగుతున్నారు. విశ్రాంతి లేకుండా తిరుగుతుండడంతో తీవ్రంగా అలసటకు గురైన ఆయన ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. రాణిపేటలోని తన నివాసం నుండి బయలుదేరేందుకు సిద్ధమవుతూ.. ఊపిరి పీల్చుకోలేకపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశారు. తమిళనాట ఎన్నికల ప్రచారంలో మంగళవారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఠారెత్తిస్తున్న ఎండలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. వయో భారం లెక్కచేయకుండా తిరుగుతున్ననేతలు ఒక్కసారిగా పునరాలోచనలో పడ్డారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలందరూ దిగ్భ్రాంతిని.. వ్యక్తం చేస్తూ.. రాజ్యసభ సభ్యుడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.