సొంత గ్రామాలకు దిశ నిందితుల మృతదేహాలు

సొంత గ్రామాలకు దిశ నిందితుల మృతదేహాలు

దిశ నిందితుల మృతదేహాలు వారి సొంతగ్రామాలైన గుడిగండ్ల, జక్లేర్ కు చేరుకున్నాయి. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యుల ఏర్పాటు చేపట్టారు.ఇవాళ గాంధీ ఆస్పత్రిలో దిశ నిందితుల డెడ్ బాడీలకు ఎయిమ్స్‌ టీం రీపోస్టుమార్టం నిర్వహించింది. తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించారు డాక్టర్లు. తర్వాత రెండు అంబులెన్స్‌ల్లో డెడ్ బాడీలకు నారాయణ పేట జిల్లా గుడిగండ్ల, జక్లేర్ కు తరలించారు. దిశ నిందితుల డెడ్ బాడీలను చూసేందుకు ఆయా గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో రెండు గ్రామాల్లో పోలీసులు భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.