
సుప్రీంలో పిల్ .. విచారణకు అంగీకరించిన కోర్టు
న్యూఢిల్లీ: విడాకులు ఇచ్చే నిబంధనలు దేశంలోని అందరికీ ఒకే విధంగా ఉండాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు దానిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశంలోని అన్ని మతాల మహిళలను ఒకేలా చూడాలని
కోరుతూ బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ బొపన్న, రామసుబ్రహ్మణియంతో కూడిన బెంచ్ విచారించింది. ‘వ్యక్తిగత చట్టాల్లోకి అక్రమంగా ప్రవేశించి, వ్యక్తిగత చట్టాలు సాధించాలనుకున్నదాన్ని ధ్వంసం చేసే దిశలో మేం వెళ్లేలా చేస్తున్నారు’ అని బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
For More News..